చివ్వెంల, మార్చి 12 : రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఆలయం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దురాజ్పల్లిలోని పెద్ద గట్టు ఆలయ ప్రారంగణంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తన ఎంపీ నిధులు రూ 65 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను మంగళవారం ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ కనీసం నిలువ నీడలేని పెద్ద గుట్ట ప్రాంతాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, రాంమూర్తి యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, కాస శ్రీనివాస్ యాదవ్, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, ఎంపీపీలు బీరవోలు రవీందర్రెడ్డి, నెమ్మాది భిక్షం, దావుల మనీషా వీరప్రసాద్ యాదవ్, జడ్పీటీసీ జీడి భిక్షం, కాంగ్రెస్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, రామగిరి నగేశ్, ధరావత్ బాబునాయక్ పాల్గొన్నారు.