ఐదు రోజులుగా పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఆదివారం పలుచోట్ల వినాయక శోభాయాత్ర నిర్వహించి సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేశారు.
అంతకుముందు యువకులు డప్పుచప్పుళ్లు, డీజే మోతల మధ్య తీన్మార్ డ్యాన్స్లతో లంబోధరుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. నవరాత్రోత్సవాలు నిర్వహించే వినాయక మండపాల వద్ద అన్నదానాలు చేశారు.