నల్లగొండ, డిసెంబర్ 8 : ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నది. ఈ పంట ఆదాయ వనరుగా రానున్న క్రమంలో సాగులో యాజమాన్య పద్ధతులతోపాటు ఫర్టిగేషన్ విధానం ఎంతో ముఖ్యమని ఉద్యాన శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి సూచిస్తున్నారు. ఫర్టిగేషన్ను సక్రమంగా చేస్తే ఖర్చు తగ్గటంతో పాటు దిగుబడి కూడా పెరుగుతుందని ఆయన చెబుతున్నారు. ఫర్టిగేషన్పై రైతులకు పలు సూచనలు చేశారు.
చేయాల్సిన విధానం..
ఉపయోగాలు..
ఫర్టిగేషన్ అంటే
ఆయిల్పామ్ సాగులో సాగు వ్యయం, ఎరువులు, కూలీల ఖర్చు ప్రధానమైన అంశాలు. ఎరువుల ఖర్చులో సగం మేరకు తగ్గించుకొని నీటిని, పోషకాలను సద్వినియోగపర్చుకుంటూ రెట్టింపు నికరాదాయం పొందేందుకు ఫర్టిగేషన్ సిఫారసు చేయబడినది. సాగు నీరు, పంటకు అవసరమయ్యే పోషకాలు సిఫారసు మేరకు ఒకేసారి సూక్ష్మ నీటి పారుదల పద్ధతిలో మొక్కలకు అందించటాన్ని ఫర్టిగేషన్ అంటారు.