రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం త్రిపురారంలో పీఏసీఎస్ వాణిజ్య భవన సముదాయం,కార్యాలయాన్ని, నిడమనూరులో పీఏసీఎస్ భవనం, గోదామును మంత్రి ప్రారంభించారు. అనంతరం నిడమనూరు వ్యవసాయ మార్కెట్ పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్తోనే దేశానికి మేలు జరుగుతుందని ఇతర రాష్ర్టాల ప్రజలు బలంగా నమ్ముతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని అన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని రాజకీయ గద్దలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు రాష్ట్రంపై వాలుతున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో తలసరి ఆదాయం పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో సైతం తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు లేవని, విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. పంట పెట్టుబడి నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్కు రైతులు వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యతోపాటు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు భగత్కుమార్, భాస్కర్రావు, డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ జానయ్యయాదవ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిడమనూరు, జనవరి 23 : బీఆర్ఎస్ పాలనలోనే రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం లభించిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో రూ.35లక్షల వ్యయంతో పునర్నిర్మించిన పీఏసీఎస్ భవనం, గోదాములను సోమవారం ఆయన ఎమ్మెల్యే నోముల భగత్కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్ పథకాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.
రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ పాలన దేశానికి మేలు చేస్తుందని ఇతర రాష్ర్టాల ప్రజలు బలంగా నమ్ముతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సమగ్రాభివృద్ధిని చూసి ఓర్వలేని కేంద్రంలోని రాజకీయ గద్దలు అధికారం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు రాష్ట్రంపై వాలుతున్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో తలసరి ఆదాయం పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవన్నారు. దేశంలో విద్యుత్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాష్ర్టాలను చీకట్లోకి నెట్టివేశారని విమర్శించారు.
దేశాన్ని అధోగతి పాలు చేసిన మోదీ నల్లధనం బయటకు తెస్తానని మాయమాటలు చెప్పి దాన్ని దాచుకునేందుకు రూ.2వేల నోట్లతో కార్పొరేట్లకు అవకాశం కల్పించారన్నారు. సామాన్యుల ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న హామీకి ఎనిమిదేండ్లు గడిచినా మోక్షం రాకపోవడంపై నిలదీయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు 15లక్షల మందిని తొలగించి నిరుద్యోగులుగా మార్చిన చరిత్ర ప్రధాని మోదీదైతే తెలంగాణలో ఆకలి, దరిద్రాన్ని పారదోలిన ఘనత సీఎం కేసీఆర్దని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే సీఎం కేసీఆర్కు అందరూ వెన్నంటి ఉండాలని పిలుపునిచ్చారు.
అంతకు ముందు జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మెరుగు రామలింగయ్య, డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలకవర్గానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, ట్రైకార్, ఆగ్రోస్ కార్పొరేషన్ల చైర్మన్లు ఇస్లావత్ రాంచందర్నాయక్, తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, నాయకులు చేకూరి హనుమంతరావు, సాదం సంపత్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు కామర్ల జానయ్య, నూకల వెంకట్రెడ్డి, కట్టెబోయిన గురవయ్యయాదవ్, మన్నెం రంజిత్యాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, బొల్లం రవియాదవ్, ఉన్నం చిన్నవీరయ్య, మాచర్ల దాసు, కోమటి వెంకన్న, బొల్లం సైదులు పాల్గొన్నారు.
త్రిపురారంలో పీఏసీఎస్ భవనం ప్రారంభం
త్రిపురారం, జనవరి 23 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని పీఏసీఎస్ నూతన వాణిజ్య భవన సముదాయం, కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పీఏసీఎస్ల ఆధ్వర్యంలో రుణాలు ఇవ్వడంతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతుల పిల్లలు విదేశీ విద్య చదువుకోవడానికి, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడానికి సహకార సంఘాలకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని కొనియాడారు.
కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే భగత్కుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్, బీసీఎంఎస్ జిల్లా చైర్మన్ వట్టె జానయ్య, ఆర్డీఓ చెన్నయ్య, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, తాసీల్దార్ కేసీ.ప్రమీల, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, పీఏసీఎస్ చైర్మన్లు జయరాంనాయక్, భాస్కర్, సీఈఓలు నర్సయ్య, గోవర్ధన్, ఉపేందర్, స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.