కట్టంగూర్, ఏప్రిల్ 06 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్నారం. గార్లబాయిగూడెం, కురుమర్తి, కట్టంగూర్, ముత్యాలమ్మగూడెం గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. నియోజకవర్గంలో 50 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్ల వేగవతంతం చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
రైతులు ఆధైర్య పడవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి, తాసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ పి.జ్ఞానప్రకాశ్ రావు, వ్యవసాయ అధికారి గిరిప్రసాద్, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లారెడ్డి, ఏపీఎం రాములు, ఆయా గ్రామాల సర్పంచ్ లుతేలు సత్తయ్య. దార సత్తెమ్మ, కడారి సంధ్య, కట్టంగూర్ ఉప సర్పంచ్ గుండు రాంబాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుండు పరమేష్, బండారు కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, బెజవాడ సైదులు, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు, ముత్యాల లింగయ్య. అయితగోని నర్సింహ్మ, అయితగోని ఝాన్సీ, సంఘ బంధం అధ్యక్షులు, సీసీలు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి : ఎమ్మెల్యే వేముల వీరేశం