మిర్యాలగూడ, జూలై 12 : రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. అసలు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం రైతులను అవమానించడమే అని.. రైతుల జోలికొస్తే రేవంత్ను, కాంగ్రెస్ పార్టీని వారు తరిమి కొట్టడం ఖాయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. బీఆర్ఎస్, రైతుల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని రైతువేదిక నుంచి రాజీవ్చౌక్ వరకు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ కోసం ఉద్యమించిన రైతులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించిన చంద్రబాబుకు ప్రియ శిష్యుడైన రేవంత్రెడ్డి బాబు అడుగుజాడల్లోనే నడుస్తున్నాడన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పాలనతో వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరెంట్ కష్టాలు పారదోలి వ్యవసాయాన్ని పండుగలా మార్చారన్నారు. మళ్లీ పాత కాలాన్ని తీసుకు రావాలని భావిస్తున్న కాంగ్రెస్కు రైతులే తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు ధనావత్ చిట్టిబాబూనాయక్, మట్టపల్లి సైదులుయాదవ్, గడగోజు ఏడుకొండలు, పునాటి లక్ష్మీనారాయణ, బీ.శ్రీనివాస్, వీ.రామకృష్ణ, ఎండీ. షోయబ్, యాదగిరి, రవీందర్, వేణు పాల్గొన్నారు.
రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
డిండి : మండల కేంద్రంలో ఎంపీపీ సునీతాజనార్ధన్రావు ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సర్పంచులు మేకల సాయమ్మాకాశయ్య, రవీందర్రావు, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్రావు, ఎంపీటీసీ బుషిపాక వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్గౌడ్, మల్లయ్య, కలీం, నూకం వెంకటేశ్, తిరుపతయ్య, మూడావత్ రవి, జయంత్, విష్ణు, తండు శ్రీనయ్య, ఈశ్వరయ్య, హుస్సేన్, రషీద్, ప్రమీల పాల్గొన్నారు.
చందంపేట, నేరేడుగొమ్ములో..
చందంపేట : బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చందంపేట, నేరేడుగొమ్ము మండల కేంద్రాల్లో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, గిరి, మోహన్, మున్నయ్య, కుమార్, శివ, శ్రీశైలం, రమేశ్, గోవర్దన్, శ్యామ్రావు, బాలవర్ధిరాజు, శ్రీను, దశరథ, నర్యానాయక్, గాసినాయక్, నేరేడుగొమ్ములో జడ్పీటీసీ బాలూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతయ్య, రాములు, వెంకటయ్య, నరేశ్, కేశవులు, సాయన్న పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : మండలంలోని అంగడిపేట స్టేజీ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునగాల అంజిరెడ్డి, నాయకులు పాల్వాయి రంగారెడ్డి, నర్సింహ, యర్రయాదగిరి, నరేందర్, శ్రీనివాస్, కర్ణయ్య, మణిపాల్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
దామరచర్ల : మండల కేంద్రంలోని నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్చైర్మన్ డి. నారాయణరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కె. వీరకోటిరెడ్డి, వైస్ ఎంపీపీ కె. సైదులురెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు ఎండీ. యూసుఫ్, హతీరాంనాయక్, పడిగెపాటి కోటిరెడ్డి, ఎస్కే నాగుల్మీరా, బాలశ్రీనివాస్, రాయికింది సైదులు, ఎం. కిషన్నాయక్, కొండారపు నాగేశ్వర్రావు, పగిడి కొండలు, లింగారెడ్డి, రవీందర్నాయక్, గోపీ, రఫీ, హాజీ పాల్గొన్నారు.
అడవిదేవులపల్లి : జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చినరామయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సూర్యానాయక్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
వేములపల్లి : మండల కేంద్రంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, సర్పంచులు చిర్ర మల్లయ్యయాదవ్, దొంతిరెడ్డి వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, కట్టా మల్లేశ్గౌడ్, గౌరు శ్రీనివాస్, ఇరుగు వెంకటయ్య, గురువారావు, కృపాకర్రావు, పుట్ట పౌల్, రెమడాల ప్రవీణ్ పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య, సర్పంచ్ చాడ చక్రవర్తి, నాయకులు కుప్ప పృద్వీరాజు, తేలుకుంట్ల కురుమారెడ్డి, బొంగరాల శ్రీను, మేడి వెంకన్న, తరి వెంకటయ్య, మేకల వెంకట్రెడ్డి పాల్గొన్నారు
నందికొండ : పైలాన్కాలనీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఇర్ల రామకృష్ణ, రమేశ్జీ, మంగ్తానాయక్, నాయకులు మోహన్నాయక్, ఆదాస్ విక్రమ్, చంద్రయ్య, చాంద్పాషా, శేఖరాచారి, సైదులు, మన్సూర్, అరుణ్కుమార్ పాల్గొన్నారు.
త్రిపురారం : మండలంలోని పెద్దదేవులపల్లిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్ ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంబటి రాము, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న, శేఖర్, సోమయ్య, బాలకృష్ణ, దైద రవి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
కొండమల్లేపల్లి, జూలై 12 : కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలని, ఆ రెండు పార్టీలకు రైతులు తగిన బుద్ధి చెప్పాలని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు, మూడు గంటలే చాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. అనంతరం రేవంత్రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన కష్టాలు పునరావృతం కావద్దనే సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పాటైన తర్వాత రైతులకు ఉచిత నాణ్యమైన నిరంతర కరెంట్ అందిస్తున్నారన్నారు. ఇది చూసి ఓర్వలేకే రేవంత్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. రైతులే అతడికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, జడ్పీటీసీ సలహాదారుడు పస్నూరి యుగేంధర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, ఉప సర్పంచ్ గంధం సురేశ్, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎలిమినేటి సాయి, నాయకులు తులసీరాం నాయక్, నేనావత్ రాంబాబునాయక్, ఎం. వెంకట్రెడ్డి, గుండబోయిన లింగం యాదవ్, వడ్త్య బలరాంనాయక్, రమావత్ దీప్లాల్ నాయక్, రమావత్ రాములు నాయక్, రమావత్ భీంసింగ్, రాములునాయక్, శ్రీను నాయక్, రూప్లా నాయక్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.