ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తుండడంపై రైతాంగంలో సంతోషం వెల్లువిరుస్తున్నది. గురువారం నుంచే విడుతల వారీగా రుణమాఫీ జరుగుతుండడంతో ఊరూరా సంబురాలు చేస్తున్నారు. రెండో రోజు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. గ్రామ కూడళ్లు, రైతు వేదికలు, పొలాల వద్ద వివిధ రూపాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకలు చేపట్టారు. జై కేసీఆర్.. జయహో బీఆర్ఎస్ సర్కార్ అంటూ నినాదాలు మార్మోగించారు. రైతులతో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోళ్లు వంటి కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నదాతలు ఆనందంగా చెప్తునారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)
రైతు రుణమాఫీపై ఉమ్మడి జిల్లా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ సంబురాలు నిర్వహిస్తున్నది. శుక్రవారం గ్రామ కూడళ్లు, రైతు వేదికలు, వరి పొలాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు రైతులు క్షీరాభిషేకం చేశారు. స్వీట్లు పంచుకున్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి తీసుకున్న రుణాలకు సంబంధించి గతంలోనే రూ.37వేల వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఇక గురువారం రూ.41వేల వరకు రుణం ఉన్న వారికి మాఫీని వర్తింపజేశారు. ఇలా దశల వారీగా ఒక్కో కుటుంబంలో లక్ష రూపాయల వరకు తీసుకున్న వారందరి రుణాలు మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వచ్చే నెల 15లోపు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ)
భువనగిరి సిటీ, ఆగస్టు 4 : రైతు రుణమాఫీపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని జగ్జీవన్రామ్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మారెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, పట్టణ అధ్యక్షుడు ఆంబోతుల కిరణ్, నాయకులు మల్లయ్య, ఓంప్రకాశ్ గౌడ్, శ్రీనివాస్రెడ్డి, పాండు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
వలిగొండ, ఆగస్టు 4 : రైతుల రుణమాఫీ చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, సర్పంచ్ వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, నాయకులు సంజీవరెడ్డి, శివశాంత్రెడ్డి, రాంరెడ్డి, సత్తిరెడ్డి, లింగస్వామి, పాండరి, రత్నయ్య, రవీంద్ర, శ్రీనివాస్, కవిత పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 4 : వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచాడని మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్తోపాటు రూ.19వేల కోట్ల రుణమాఫీ చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్రెడ్డి, నాయకులు గోరంటి శ్రీనివాస్రెడ్డి, చక్రపాణి, మధు, మల్లారెడ్డి, అఖిల, నరసింహ, మల్లేశం, శ్రవణ్ పాల్గొన్నారు.
శాలిగౌరారం, ఆగస్టు 4 : మండలంలోని వల్లాల గ్రామంలోని ఓ రైతు పొలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇంతియాజ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు గుండ్లపల్లి శంకరయ్య, ఉప సర్పంచ్ గుండ్లపల్లి సైదులు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు భూపతి సత్యనారాయణగౌడ్, నాయకులు మాదగోని నాగయ్య, శేఖర్రెడ్డి, దావీద్, వెంకన్న పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 4 : రైతు రుణమాఫీని హర్షిస్తూ మండలంలోని కూనూరు గ్రామంలో పంట పొలాల్లో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాశం మహేశ్, నాయకులు అబ్బగాని వెంకటేశ్, ఉప సర్పంచ్ గుండ్ల శ్రీనువాస్, ముల్లె నాగేంద్రబాబు, నాగరాజు, రమేశ్, రైతులు పాల్గొన్నారు.
చిట్యాల, ఆగస్టు 4 : మండలంలోని గుండ్రాంపల్లి, వట్టిమర్తి గ్రామాల్లోని రైతువేదికల వద్ద బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు భీమిడి చిన వెంకట్రెడ్డి, సర్పంచ్ రత్నం పుష్ప, నాయకులు మారగోని శివశంకర్, రాచకొండ కృష్ణయ్య, నర్సింహ, వాజిద్, బాలరాజు, లింగస్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి, రాజు, నరేందర్రెడ్డి, కృష్ణయ్య, భిక్షంరెడ్డి, దామోదర్రెడ్డి, వెంకట్రెడ్డి, కృష్ణయ్య, ప్రకాశ్, మధు, హరికృష్ణ పాల్గొన్నారు.
గరిడేపల్లి, ఆగస్టు 4 : మండల కేంద్రంలోని సర్వారం పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం సంఘం చైర్మన్ వీరంరెడ్డి శంభిరెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించి రుణం తీర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ పెండెం శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్, గ్రామ సర్పంచ్ టి.సీతారాంరెడ్డి, నాయకులు ప్రధాని సైదులు, వెంకటరమణారెడ్డి, కృష్ణ, ఎన్.సైదయ్య, శోభన్బాబు, జయరాంనాయక్, రాంరెడ్డి, రాములు, నర్సయ్య పాల్గొన్నారు.
తుంగతుర్తి, ఆగస్టు 4 : రైతును రారాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మండలంలోని సూర్యతండాలో సర్పంచ్ యాకూనాయక్ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మోహన్లాల్, రాందాస్ పాల్గొన్నారు.
మోతె, ఆగస్టు 4 : మండలంలోని బల్లుతండా గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రుణమాఫీతోపాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేసిన కేసీఆర్ దేశంలో నెంబర్ వన్ సీఎంగా నిలిచారన్నారు. రైతులు ఎప్పుడూ సీఎం కేసీఆర్కు అండగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా గాంధీ, వార్డు సభ్యులు పాల్గొన్నారరు.