బొడ్రాయిబజార్, జూలై 15 : రాష్ట్ర స్థాయి రైతు సదస్సు, రైతుమిత్ర, రైతు సేవారత్న అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించనున్నారు. ఈ మేరకు రైతు సదస్సు పోస్టర్ను విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం సూర్యాపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేవీకే రైతుమిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమీకృత వ్యవసాయంపై అవగాహన సదస్సులు నిర్వహించడం అభినందనీ యమన్నారు.
రైతుమిత్ర ఫౌండర్ పగడాల ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పనిముట్ల ప్రదర్శన, పంటల ప్రదర్శన, 18 రకాల కూరగాయల విత్తనాల పంపిణీ, ఉత్తమ రైతు దంపతులకు రైతుమిత్ర అవార్డ్స్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రైతు సేవా రత్న అవార్డుల ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతకుముందు జరిగిన సమావేశంలో కేవీకే రైతుమిత్ర జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గొట్టిముక్కల నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి పుల్లారావు, గింజుపల్లి రమేశ్, ఉపాధ్యక్షులుగా చందా ప్రసాదరావు, నెమరుగొమ్ముల శిల్ప, వీరబోయిన లింగస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మిర్యాల చంద్రశేఖర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా బానోతు గంగరాజు, దొంగరి మౌనిశ్, కె.సురేశ్, కోశాధికారిగా గంగిరెడ్డి రవీందర్రెడ్డి ఎన్నుకున్నారు. కొత్త కమిటీని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రైతుమిత్ర రాష్ట్ర కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడుఎల్లినేని రాధాకృష్ణ, జిల్లా నూతన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.