విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
భువనగిరి ఏడీఏ దేవ్సింగ్
బొమ్మలరామారం, మే 17 : విత్తన దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని భువనగిరి ఏడీఏ దేవ్సింగ్ హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలోని విత్తన స్కాడ్ బృందం మంగళవారం మండల కేంద్రంతోపాటు చీకటిమామిడి, మర్యాల గ్రామాల్లోని విత్తన షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్లు, ఇన్వాయిస్ కాపీలు, విత్తన ప్యాకెట్ల లేబుళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లు ఇవ్వకుండా విత్తనాలు అమ్మవద్దని షాపు నిర్వాహకులకు సూచించారు. తనిఖీల్లో రాజాపేట, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల వ్యవసాయాధికారులు మాధవి, రాజేశ్, దీప్తి, యాదగిరిగుట్ట ఎస్ఐ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
భూదాన్పోచంపల్లిలో తనిఖీలు..
బీబీనగర్ (భూదాన్పోచంపల్లి) : నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏడీఏ నీలిమ హెచ్చరించారు. మంగళవారం భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలోని విత్తన దుకాణాల్లో అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. విత్తన ప్యాకెట్ల గడువు తేదీ, దుకాణదారుల లైసెన్సులు, స్టాక్ వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అమ్మితే దుకాణాలను సీజ్ చేయడమే కాకుండా యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు అలీఖాన్, పద్మ, సుజాత, ఎస్ఐ నాగరాజు పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ : మండల కేంద్రంలోని విత్తన విక్రయ దుకాణాల్లో జిల్లా వ్యవ సాయశాఖ అధికారుల బృందం తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా విత్తన దుకాణాల్లోని విత్తన నిల్వలు, రికార్డులు, రసీదు పుస్తకాలను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.