నీలగిరి, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సోమవారం 23వ రోజు విజయవంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 74 వైద్య బృందాలు మొత్తం ఇప్పటివరకు 2,06,226 మందికి పరీక్షలు నిర్వహించారు. సోమవారం 9,273 మందికి పరీక్షలు చేయగా 4,538 పురుషులు, 4,727 మంది స్త్రీలు ఉన్నారు. వీరిలో 1,368 మంది దగ్గర, 918 మందికి దూరం చూపు సమస్య ఉన్నందున కండ్లద్దాలు అందజేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన అద్దాలను 189 మందికి అందజేయగా ఇంకా 19,848 మందికి సంబంధించిన అద్దాలు ఆర్డర్ చేశారు. మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు మెడికల్ ఆఫీసర్లు, క్యాంపు కోఆర్డినేటర్లు, ఆఫ్తమాలజిస్టులు ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
111 క్యాంపుల్లో పరీక్షలు
సూర్యాపేట : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి స్పందన బాగుంది. 23 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు 1,41,187 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 616 క్యాంప్లకుగాను 111 క్యాంపుల్లో పరీక్షలు పూర్తయ్యా యి. రెండ్రోజుల సెలవు అనంతరం కంటి వెలుగు సోమవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 6,651 మంది కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 1,112 మందికి రీడింగ్ గ్లాస్లు అందజేశారు. మరో 639 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాస్ల కోసం రెఫర్ చేశారు. 3,442 మందికి మందులు అందజేశారు.
యాద్రాద్రిలో 86,442మందికి కంటి పరీక్షలు
భువనగిరి కలెక్టరేట్ : కంటివెలుగు రెండో విడుతతో ఇప్పటి వరకు జిల్లాలో 86,442మందికి కంటి పరీక్షలు చేపట్టినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జునరావు సోమవారం తెలిపారు. ఈక్రమంలో కంటి పరీక్షల్లో 16, 940మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేశామని, 11,893మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేసినట్లు తెలిపారు. సోమవారం ఒక్కరోజు 3,800మందికి కంటి పరీక్షలు చేసి 593మందికి రీడింగ్ అద్దాలను అందజేశామ ని అదేవిధంగా 393మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ చేశామని 662మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.