ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని.. వీరభద్రస్వామి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ నల్గగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆకాంక్షించారు. బుధవారం దేవరకొండ మండలం కమలాపురం జాతర సందర్భంగా వీరభద్ర స్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అయన అన్నారు. ప్రత్యేక పూజల అనంతరం రవీంద్రకుమార్ను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.