నల్లగొండ రూరల్, అక్టోబర్ 18 : రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. నల్లగొండ మండలం పీఏసీఎస్ పరిధిలోని గొల్లగూడ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్జాలబావిలో, అన్నదాత సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డికాలనీ, చందనలపల్లిలో , ఐకేపీ ఆధ్వర్యంలో చిన్న సూరారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల అవసరాల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఇప్పటీ వరకు 213 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అవరసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని, తాలు లేకుండా తూర్పార పట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని సూచించారు. కొనుగోలు దారులు, రైతులు సమన్వయంతో వ్యవహరించి ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఓ కిరణ్కుమార్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వర్రావు, పీడీ కాళిందిని, మార్కెటింగ్ ఏడీ శ్రీకాంత్, ఏఓ శ్రీనివాస్, సీఈఓ కంచర్ల అనంతరెడ్డి, ఏపీఎం సైదులు, అన్నదాత సొసైటీ నిర్వాహకులు గాదె రాజశేఖర్రెడ్డి, శ్రీనివాస్, రామలింగం, బట్టు నవీన్, ఆంజనేయులు వీఓఏలు పాల్గొన్నారు.
మండలంలోని ఖాజీరామారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఏ డీపీఎం రామలింగయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్వాహకులు దొనకొండ రవికుమార్, కుందారపు గంగరాని పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని అయిటిపాముల, కట్టంగూర్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పోరెళ్ల సునీత, ఏపీఎం చౌగోని వినోద, డీటీ జ్యోతి, పీఏసీఎస్ సీఈఓ మల్లారెడ్డి, చెరుకు చంద్రయ్య, సీసీలు కారింగ్ శంకర్, కొండ మట్ట య్య, సీఆర్పీ చౌగోని స్వాతి, మండల సమాఖ్య అధ్యక్షురాలు తాటిపాముల చైతన్య పాల్గొన్నారు.
తిప్పర్తి : రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని అంతయ్యగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. మండలంలోని పజ్జూరు, థానేదార్పల్లి గ్రామాల్లో డీపీఎం రామలింగయ్య, ఏపీడీ సరస్వతి, ఏపీఎం శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పీ జానకి, సీసీలు ఎమేల్యా, రామస్వామి, సంఘబంధం అధ్యక్షురాలు కన్నెబోయిన లక్షి, రైతులు పాల్గొన్నారు.