నీలగిరి, మే 25 : ఎమ్మెల్సీ పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్ నుంచి నియోజకవర్గ పరిధిలోని 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వాయ్లెట్ కలర్ సెచ్ పెన్ ద్వారానే ఓటర్లు ఓటు వేసేలా చూడాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను క్లోజ్ కంటైనర్లో నల్లగొండకు పంపించాలని సూచించారు.
బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చేలా చూడాలని, మరుసటి రోజు ఉదయం 5 గం టలకు వాటిని స్ట్రాంగ్ రూమ్లో సీల్ చేసే విధంగా సహకరించాలని కోరారు. అనంతరం అనిశెట్టి దుప్పలపల్లిలో బ్యాలెట్ పేపర్లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, టి.పూర్ణచంద్ర, డీఆర్ఓ రాజ్యలక్ష్మి, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.