రామగిరి/సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 11 : ఈద్ ఉల్ ఫిత్న్రు ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కొత్త వస్ర్తాలు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షీర్ఖుర్మాతోపాటు పలు వంటకాలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సేవించారు. పేదలకు దానధర్మాలు చేసి పండుగ విశిష్టతను చాటుకున్నారు. బంధుమిత్రుల ఆలింగనాలు, శుభాకాంక్షలతో పల్లెలు, పట్టణాల్లో రంజాన్ శోభ ఉట్టి పడింది.
సూర్యాపేటలోని గాంధీనగర్ ఈద్గాలో ముస్లింలతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. నల్లగొండలోని మునుగోడు రోడ్డు ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.