కోదాడ, డిసెంబర్ 25 : రాష్ట్రంలో రవాణా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. స్థానిక లారీ అసోసియేషన్లో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే రవాణా రంగానికి అనేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లారీ యజమానుల సమస్యల పరిష్కరానికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్పద్మావతిరెడ్డి ఉప్పలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. లారీ అసోసియేషన్ నాయకులు అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లారీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామినేని శ్రీనివాస్రావు, ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రామారావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షుడు కనగాల నాగేశ్వర్రావు, బీఆర్ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, పైడిమర్రి వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి టీ. కృష్ణ, నర్సయ్య, ప్రసాద్, నాగేశ్వర్రావు, నరసరాజు, అంజయ్య, గౌస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యుత్శాఖలో ప్రైవేట్ వర్కర్ల సమస్యల పరిష్కరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే
విద్యుత్ శాఖలో ప్రైవేట్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలోని విద్యుత్ ప్రైవేట్ వర్కర్ల యూనియన్ భవనంలో ఆదివారం ఆయన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని విద్యుత్ వర్కర్ల సంఘం నాయకులు ఎమ్మెల్యేని కోరారు. స్పందించిన ఆయన ప్రైవేట్ బీమా సంస్థల నుంచి బీమా అందించేందుకు సహకారం అందిస్తానన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన వారికి బీమా సౌకర్యం ఉందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనియన్ భవనం వద్ద సీసీరోడ్డు మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తోట శ్రవణ్కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పుల రాజేశ్వర్రావు, కోదాడ విద్యుత్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పెద్ది శేషు, కార్యదర్శి వెంకటేశ్వర్రావు, వజ్రాల శంకర్, మల్లెం ప్రకాశ్, షేక్ అబ్దుల్,నాగులమీరా, నాగేశ్వర్రావు, సోమశేఖర్, అజయ్కుమార్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మందుల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్
కోదాడ, : మందుల కులస్తుల సమస్యల పర్కిరానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఐదోవార్డు శ్రీరంగాపురంలో మందుల కులస్తుల కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రిస్టియన్లకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీహాల్ నిర్మాణ దాతలను అభినందించారు. సమాజానికి ఉపయోగపడే ఎటువంటి కార్యక్రమాల్లో తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రభు త్వం సంక్షేమ పథకాల్లో మందుల కులస్తులకు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రభుత్వం సబ్బండ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. వెనుకబడిన కులాలన్నీ ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కమ్యూనిటీహాల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారాధారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వెంపటి మధుసూదన్, కాటమరెడ్డి ప్రసాద్రెడ్డి, కౌన్సిలర్లు, కందుల చంద్రశేఖర్, కోటేశ్వరరావు, కోట మధుసుదన్, లలిత, రమాశ్రీనివాస్, రామారావు, గ్రంథాలయ చైర్మన్ రహీం, నాయకులు ఉపేందర్గౌడ్, బత్తుల ఉపేందర్, నరేశ్, మందుల కుల సంఘ పెద్దలు పాల్గొన్నారు.