ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట విలువేంటో చేసి చూపారు. చెప్పిన పది రోజుల్లోపే రుణమాపీపై తీపి కబురు అందించారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి పంద్రాగస్టు కానుకను ప్రకటించారు. రూ.99,999 వరకు ఉన్న రుణం రైతులందరికీ వెంటనే మాఫీని వర్తింప జేసేలా ఆదేశాలిచ్చారు. ఇక మిగిలింది లక్ష రూపాయల అప్పు తీసుకున్న రైతులు మాత్రమే. దాంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు లక్ష మంది రైతులకు రూ.600 కోట్ల వరకు ఒకేసారి లబ్ధి చేకూరనున్నది. జిల్లా అంతటా ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటగా మరోవైపు రైతాంగంలో రుణమాఫీ సంబురం కనిపించింది. రైతు పక్షపాతి కేసీఆర్తోనే ఇలాంటివన్నీ సాధ్యమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ) : 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 డిసెంబర్11 నాటికి ఏదైనా బ్యాంకు నుంచి రూ. లక్ష వరకు వ్యవసాయ రుణాలు పొంది ఉన్న రైతులందరికీ రుణమాఫీని వర్తింప చేయనున్నట్లు అప్పటి ప్రకటన సారాంశం. మొత్తం నాలుగు విడుతల్లో పూర్తి చేయనున్నట్లు కూడా చెప్పారు. ఇచ్చిన మా ప్రకారం తొలి ఏడాది ఫిబ్రవరిలోనే రూ.25వేల వరకు రుణం తీసుకున్న రైతుల రుణాలన్నీ మాఫీ వర్తింప చేశారు. రెండో విడుతలో రూ.37వేల వరకు రుణమాఫీని అమలు చేశారు. ఆ తర్వాత వరుసగా నోట్ల రద్దు, కరోనా తదితర పరిణామాలు ఇతర పథకాల మాదిరిగానే రుణమాఫీ పథకంపైనా ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థ్ధిక పరిస్థితి తిరిగి గాఢిలో పడుతున్న తరణంలో లక్ష రూపాయల వరకు రుణమాఫీని వర్తింప చేస్తామని ఈ నెల 2వ తేదీన సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులోభాగంగా రూ.37వేల తర్వాత నుంచి రుణమాఫీని వర్తింప చేయడం ప్రారంభించారు. ఈ నెల 3న రూ.41వేల వరకు, ఈ నెల4న రూ.43వేల వరకు మాఫీ చేస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు.
ఈ నెల 11న మరోసారి రూ.50వేల వరకు రుణమాఫీని అమలు చేశారు. ఈ క్రమంలో సోమవారం సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒకేసారి రూ.99,999 వరకు రుణం ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వెంటనే నిధులను కూడా విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో జమ చేసేలా ఆదేశించారు. తద్వారా ఉమ్మడి జిల్లాలో అధికారుల అంచనా ప్రకారం సుమారు లక్ష మంది రైతులకు రూ.600 కోట్ల వరకు రుణమాఫీ జరిగినట్లు తెలుస్తున్నది. ఇక మిగిలిన ఉన్న రూ.లక్ష అప్పు రైతులకు మాత్రం త్వరలోనే రుణమాఫీని వర్తింప చేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును కొనసాగిస్తున్నది. దీనిని బట్టి అతి త్వరలోనే రూ.లక్ష రుణమాఫీ పథకం సంపూర్ణం కానుందని స్పష్టం అవుతుంది. 2019లోనే లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతుల వివరాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం సేకరించింది.
ప్రభుత్వంవద్ద ఉన్న వివరాల ఆధారంగా నేరుగా తమ ఖాతాల్లోనే రుణమాఫీ డబ్బులు జమ అవుతుండడంతో రైతులు ఖుషీ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పక్కగా అమలు చేసి చూపుతున్నారని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉచిత కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుభీమా, పంటల కొనుగోళ్ల లాంటి ఎన్నో పథకాలతో దేశానికే ఆదర్శంగా రైతు పక్షపాత సీఎంగా కేసీఆర్ నిలిచారని రైతులు కొనియాడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటా
సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. అన్న విధంగా రుణ మాఫీ చేయడం ఆనందంగా ఉంది. రుణమాఫీతో నాలాంటి రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇప్పటికే రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత రుణమాఫీతో రైతులకు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపయోగ పడుతున్నది. సీఎం కేసీఆర్ రుణపడి ఉంటాం.
-పాంపాటి శ్రీనివాస్, పజ్జూరు
వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే
గత ప్రభుత్వాల హయాంలో నీళ్లు లేక పంటలు పండక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కొద్దిపాటి నీళ్లున్న బ్యాంకుల్లో రుణాలు అప్పులు చేసి వ్యవసాయ పెట్టుబడి పెట్టే వాళ్లం. వ్యవసాయంపై వచ్చిన పైస లు మిత్తికి సరిపోయేవి కావు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రా జెక్టుతో నీళ్లు, రైతుబంధు ద్వారా డబ్బులు, 24 గంట ల ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణమాఫీ, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్కు రూ.99,999 రుణమాఫీ చేయడం రైతంగమంతా రుణపడి ఉంటాం. వ్యవసాయాన్ని పండుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.
-దోమల బాలమల్లు(రైతు, నాగారం బంగ్లా)