మేళ్లచెర్వు, మార్చి 2 : మేళ్లచెర్వు మహా శివరాత్రి జాతరలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రంలోని వేంకటేశ్వర-కస్తూరి కల్యాణ మండపంలో విద్యుత్ ప్రభల కమిటీల నిర్వాహకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణలో పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు.
ప్రభల దగ్గర అల్లర్లు జరుగకుండా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతా కలిసి మెలిసి జాతరను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, స్థానిక ఎస్ఐ పరమేశ్, డీటీ తాసీల్దార్ నాగేశ్వర్రావు, శంభిరెడ్డి, భాస్కర్రెడ్డి, భిక్షం, రామచందర్రావు పాల్గొన్నారు.