కట్టంగూర్/చిట్యాల/ నార్కట్పల్లి, ఏప్రిల్ 12 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల, కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల్లిలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాహకులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు.
ప్రతి రోజు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లుకు పంపి, కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్ వెబ్ సైట్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో 370 కేంద్రాల్లో ఇప్పటి వరకు 8,809 మంది రైతుల నుంచి 63,500మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 12.66కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలన్నారు. కార్యక్రమాల్లో సివిల్ సప్లయ్ డీటీ రాచకొండ జ్యోతి, చిట్యాలలో డీటీ లింగస్వామి, కట్టంగూర్ ఏపీఎం కస్పరాజు సైదులు, చిట్యాల పీఏసీఎస్ సీఈఓ బ్రహ్మచారి ,నకిరేకల్ క్లస్టర్ అధికారి సురేశ్, సీఈఓ బండ మల్లారెడ్డి, సిబ్బంది చెరుకు చంద్రయ్య పాల్గొన్నారు.