మాల్, జనవరి 2 : మిషన్ భగీరథతో గ్రామాల్లో ఇంటింటికీ సురక్షిత తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చింతపల్లి మండలం గొడకొండ్ల, ప్రశాంతిపూరితండా, విరాట్నగర్లో మిషన్ భగీరథ ట్యాంకులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టిందన్నారు.
నియోజవర్గంలో వచ్చే వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తుగానే మరిన్ని నీటి ట్యాంకులను ఏర్పాటు చేయడం జరు గుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, సర్పంచులు కొండూరి శ్రీదేవీశ్రీనివాస్, దార్ల విశ్వానాథం, బంగారి, శ్రీనివాస్రెడ్డి, రవి, జగన్చారి, అండెకారు అశోక్, చాంద్పాషా, పులిరాజు, నర్సింహ, యాదయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు ప్రేమలత, పరమేశ్యాదవ్, పోషయ్య పాల్గొన్నారు.