భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు బాబా సాహెబ్ చేసిన సేవలను కొనియాడారు.
హాలియా, డిసెంబర్ 6: బడుగు వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ నాయకులు అ న్నారు. బుధవారం హాలియాలో ఆయా సం ఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని నిర్వహించారు. హాలియా బస్టాండ్ ఎదుట, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చల్మారెడ్డిగూ డెం జడ్పీహెచ్ఎస్లో, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమల్ల సత్యం, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి జంగాల లక్ష్మి, జిల్లా అధ్యక్షుడు లక్కుమల్ల మధుబాబు, పాండురంగయ్య, లిం గయ్య, రాంబాబు, సైదీష్ ఉన్నారు.
కేతేపల్లి : అంబేద్కర్ వర్ధంతిని సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ చినవెంకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ పార్టీ మం డల కార్యదర్శి చింతపల్లి లూర్ధుమారయ్య, నాయకులు ఆదిమళ్ల సుధీర్, లింగయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
కట్టంగూర్: అంబేద్కర్ వర్ధంతిని బుధవారం మండలంలోని మునుకుంట్ల, పామనుగుండ్ల, చెర్వుఅన్నారం, అయిటిపాముల, కట్టంగూర్లో ఘనంగా నిర్వహించారు. దళిత సం ఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వేర్వేరుగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, సర్పంచ్ అనితాసుధీర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నరేందర్, ఉపాధ్యక్షుడు శంకర్, సభ్యులు భిక్షపతి, రామలింగయ్య, నూకబత్తిని రాజు, నరేష్ ఉన్నారు.
శాలిగౌరారం: అంబేద్కర్ వర్ధంతిని బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ ఆర్ట్స్ అసోసియేషన్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు. ఆ అసోసియేషన్ మండలాధ్యక్షుడు జానయ్య, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సైదులు, భాస్కర్, వెంకటనారాయణ, చింత దనుంజయ్య, బట్ట సైదులు, శంకరయ్య, నర్సింహ్మ, పాపారావు, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, సమరంరెడ్డి, షేక్ ఇంతియాజ్, జనార్దన్, నక్క మల్లేష్, గణేశ్ పాల్గొన్నారు.
గట్టుప్పల్: తాసీల్దార్ కార్యాలయంలో తాసీల్దార్ లావణ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.
మాల్ : చింతపల్లి మండల కేంద్రంతో పాటు వింజమూర్లో అంబేద్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆ సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. వింజమూరి కృష్ణమాదిగ, ఆరెకంటి రాధాకృష్ణ, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏపల్లిలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొండల్, పోతెం సహాదేవుడు, నాగరాజు, కృష్ణయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ: మండలంలోని తమ్మడపల్లి, మర్రిగూడ గ్రామాల్లో బీఆర్ఎస్తో పాటు పలు కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ రజాక్, నాయకులు శ్రీనివాస్, ముత్యాలు గౌడ్, మల్లేశం, వెంకటేష్, రాములు, శ్రీనునాయక్, యాదయ్య, ముత్తయ్య, శ్రీను, శ్రీనివాస్, యాదగిరి, బాలసుందర్ రావు, నర్సింగ్రావు, నాగిళ్ల శివ, యంజాల శ్రీను, అనిల్,గణేష్ పాల్గొన్నారు.
మునుగోడు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సం ఘం ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్ వి గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రమోద్కుమార్, ప్రతాప్, నాగరాజు, విజయ్భాస్కర్, సైదులు, శ్రీకాంత్, సాయి, రమేష్, పండు, ప్రణయ్, బెల్లపురాజు పాల్గొన్నారు.
రామగిరి: అంబేద్కర్ స్ఫూర్తిని నేటి తరం యువత, విద్యార్థులు కొనసాగించాలని నల్లగొండలోని చర్లపల్లిలోని డీవీఎం విద్యా సం స్థల బీఈడీ, ఎంఈడీ, డీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ నారాయణరెడ్డి, రామకృష్ణ, శ్రీదేవి సూచించారు. శ్రీధర్, సత్యనారాయణ, నాగ య్య, రవి, వెంకటేశ్వర్లు, శ్రీధర్రెడ్డి, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇంఇయా(ఎఫ్సీఐ) నల్లగొండ డిపోలో ఉద్యోగులు అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సంస్థ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఖైసర్ అలీ, సుకుమార్, సతీష్రెడ్డి, ప్రశాంత్, రాఘవేంద్ర, రమావత్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
తిప్పర్తి: దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిచారు. తిప్పర్తి మాజీ సర్పంచ్ జాకటి మోష మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. నాయకులు గిరి, బాబర్, నూకలవెంకన్న పాల్గొన్నారు.
నీలగిరి: భావితరాలకు అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని డీఎంహెచ్ఓ డాక్టర్ కొం డల్ రావు అన్నారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ అరుంధతి, డాక్టర్ దుర్గయ్య పాల్గొన్నారు.
దామరచర్ల : మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైరం బాలగుర్వయ్య, గోపి, శం భయ్య, గోపాల్, సురేష్ తదితరులున్నారు.
అడవిదేవులపల్లి: అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేవీపీఎస్ నా యకులు దేవతల సైదులు అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూ లమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంజనేయులు, లింగయ్య, కొండలు, భిక్షం, వెంకటేశ్వర్లు, మహేష్, సైదులు, రామాంజనేయులు, రవికుమార్, లాలు పాల్గొన్నారు.
వేములపల్లి : అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సర్పంచ్ అంకెపాక రాజు అన్నారు. బుధవారం అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సల్కునూరులో ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జనార్ధన్, కూలీలు పాల్గొన్నారు.
దేవరకొండరూరల్: మండలంలోని కొండభీమనపల్లిలో బుధవారం అంబేద్కర్ వర్ధంని ఘనంగా నిర్వహించారు. డివైజాక్ రాష్ట్ర చైర్మ న్ ఎర్ర కృష్ణజాంబవ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నర్సిం హా, ఎల్లేష్, ఎర్రవిజయ్, విష్ణు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి: అంబేద్కర్ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ హెచ్ ఎస్లో అంబేద్కర్ చిత్రపటానికి ఇన్చార్జి హెచ్ఎం సీనయ్య, చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రేఖాశ్రీధర్రెడ్డి, ఎమ్మార్పీస్ ఇన్చార్జి సహదేవులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.