యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి గర్భాలయ విమానగోపురం స్వర్ణతాడపానికి పలువురు భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు బీబీనగర్కు చెందిన నూలి విజయ మనోహర్రావు కుటుంబసభ్యుల తరపున రూ. 2,51,116 విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును యాదాద్రి బాలలయంలో ఆలయ ఏఈవో గట్టు శ్రవణ్కుమార్కు అందజేశారు దాత.