యోధుడికి నివాళులర్పించిన ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, భగత్ కుమార్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్లగొండ మర్రిగూడ సమీపంలోని కొమురయ్య విగ్రహం వద్ద రాజ్య సభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్ నివాళులర్పించారు.
నల్లగొండ, జూలై 4 : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులోని మర్రిగూడ సమీపంలో ఉన్న కొమురయ్య విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, నోముల భగత్కుమార్ పూలమా లలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పోరులో కొమురయ్య చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ముఖ్పై పోరాడిన విప్లవవీరుడని అభివర్ణించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు చీర పంకజ్యాదవ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, లొడంగి గోవర్ధన్, కౌన్సిలర్లు గోగుల శ్రీనివాస్, ఊట్కూరు వెంకట్రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, దొడ్డి రమేశ్, బీపంగి కిరణ్ పాల్గొన్నారు.
సీపీఐ కార్యాలయంలో…
రామగిరి : తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 76వ వర్ధంతిని సోమవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొమురయ్య స్ఫూర్తితో ప్రజ ఉద్యమాలకు ముందుకుసాగాలని పలువురు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి ఎల్ శ్రావణ్కుమార్, సభ్యులు పబ్బు వీరస్వామి, నాయకులు రమేశ్, లెనిన్, యాదగిరి ఉన్నారు.
మిర్యాలగూడలో…
భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం దొడ్డి కొమురయ్య చేసిన పోరాటాలు మరువలేనివని యాదవ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు గుడిపాటి కోటయ్య అన్నారు. సోమవారం కొమురయ్య వర్ధంతి సందర్భంగా యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటం వద్ద నివాళుల ర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్నయాదవ్, డీబీఆర్ యాదవ్, కేపీరాజు, ఎర్రయ్య, భిక్షం, మహేశ్, లింగరాజు ఉన్నారు.
హాలియాలో…
హాలియాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. బీసీ సంక్షే మసంఘ నాయకులు చెరుపల్లి ముత్యాలు, పోశం శ్రీనివాస్గౌడ్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సురభి రాంబాబు, గోవింద్, బాలరాజు, కృష్ణ, లింగయ్య ఉన్నారు.
చిట్యాలలో…
చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో సోమవారం కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి మిర్యాల నవీన్, మండలాధ్యక్షుడు కొండె మహేశ్ పాల్గొన్నారు.