దేవరకొండ రూరల్, జనవరి 13 : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.7.05 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండకు రూ.కోటి, చందంపేటకు రూ.95 లక్షలు, చింతపల్లికి రూ.1.15 కోట్లు, గుండ్లపల్లికి రూ. 2కోట్లు, కొండమల్లేపల్లికి రూ.5 లక్షలు, నేరేడుగొమ్ము రూ.55 లక్షలు, పీఏపల్లికి రూ.90 లక్షలు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో మార్చిలోపు సీసీరోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు.
దేవరకొండ నియోజకవర్గంలోని 77 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.33.65 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీ మారుపాకుల అరుణాసురేశ్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ రహత్అలీ, చందంపేట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు కుంభం శ్రీశైలంగౌడ్, గెలమోని శ్రీను, కృష్ణ, జయప్రకాశ్ నారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండల ఆంధ్రజ్యోతి విలేకరి సంపెంగల సురేందర్ శుక్రవారం మృతి చెందగా ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నివాళులర్పించారు.