డిండి: రైతు వేదికలు కర్షక దేవాలయాలని.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం మండలంలోని చెర్కుపల్లిలో రూ.22లక్షలతో నిర్మించిన రైతు వేదికను ఎంపీపీ సునీతతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ అనేక విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్, సబ్సి డీ విత్తనాలతో పాటు, ఎరువులు సకాలంలో అందించడంతో తెలంగాణ రాష్టంలోని రైతాంగం సగర్వంగా తలెత్తుకుని జీవి స్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏఈవో వెంకటేశ్ను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మిం చిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ, వైస్ చైర్మన్ జంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు తూం నాగార్జున్రెడ్డి, శ్రీనివాస్రావు, సర్పంచ్ సుధామణి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు ఏమిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు పుల్లమ్మ, కాట్రావత్ లక్ష్మి, సంజీవ, రాఘవాచారి, జయంత్, ఆంజనేయులు, తిరుపతి, పాండు, రాజు, కృష్ణ పాల్గొన్నారు.