నల్లగొండ : జిల్లాలో సంచలనం సృష్టించిన ధనలక్ష్మి హత్యపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, ముషంపల్లి గ్రామంలో నిన్న లైంగికదాడి, హత్యకు గురైన ధనలక్ష్మి కుటుంబం నివసిస్తున్న ఇంటిని, ఘటన జరిగిన స్థలాన్ని శుక్రవారం డీఐజీ ఏవీ రంగనాధ్ పరిశీలించారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. గ్రామస్తులు, చుట్టుపక్కల వారితో ఘటనపై, నిందితుల వ్యవహారశైలిపై డీఐజీ ఆరా తీశారు.