చందంపేట, ఏప్రిల్ 11 : వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని కంబాలపల్లి, రేకులవలయం, చిత్రియాల గ్రామాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి తొట్లను పరిశీలించి మాట్లాడారు.
వేసవిలో వన్య ప్రాణుల దాహర్తిని తీర్చేందుకు నీటి తొట్లను ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నట్లు తెలిపారు. ట్రాప్ కెమెరాల ద్వారా జంతువులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వాటి అవసరానికి తగ్గట్లుగా నీటి తొట్లు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. అటవీ ప్రాంతం నుంచి కలపను అక్రమంగా తరలిస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్ఆర్ఓ సాయిప్రకాశ్, భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ శ్రీదేవి, రాగ్య, చంద్రకళ ఉన్నారు.