కట్టంగూర్, అక్టోబర్ 17 : ఒకప్పుడు ఆ గ్రామంలో కరువు విళయతాండవం చేసేది. పనులు లేక గ్రామంలోని ఎన్నో కుటుంబాలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. వ్యవసాయ, కూలీ పనులు లేకపోవడంతో అధిక శాతం మంది గ్రామస్తులు తమ ఇడ్లకు తాళాలు వేసి ఇంటిల్లుపాది కల్లు గీసేందుకు, పాల వ్యాపారం చేసేందుకు సూరత్, ఆంధ్ర, ముం బాయి ప్రాంతాలకు బతుకుదెరువు కోసం ఆరు నెలల పాటు వలసలు వేళ్లేవారు. దానిక తోడు వానకాలం వచ్చింటే గ్రామంలో వ్యాధులు విజృంభించేవి. డెంగీ, మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేవి.
అందుకు ప్రధాన కారణం గ్రా మంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్డు లేకపోవడంతో పారిశుధ్యం లోపంతో గ్రామస్తులు రోగాల బారిన పడినా నాటి పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభు త్వ చేపట్టిన అభివృద్ధి పనులతో వలసలు, వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి రైతులకు రైతుబంధు ఇవ్వడంతో వాటితో ఉన్న భూములను సేద్యం చేసుకుంటు వలసలు వెళ్లడం మానేశారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులతో ఆ గ్రామ రూపురేఖలు మారిపోయాయి.
మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న దుగినవెల్లి గ్రా మంలో 2,700 జనాభా, 1,700 ఓటర్లు ఉండగా 400 కుటుంబాలు గ్రామంలో నివాసం ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనులతో గ్రామంలో అభివృద్ధ్ది పరుగులు పెడుతున్నది. సుమారు రూ.2కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్తో వారానికి రెండ్రోజులు ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్థంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి లూజ్ లైన్లను సరి చేశారు. పల్లె ప్రకృతి వనంలో రూ. 3 వేలు, హరితహారంలో భాగంగా రోడ్లు, ప్రతి వీధికి ఇరువైపులా సుమారు 4 వేల మొక్కలు నాటారు. ప్రతి ఇంటికీ 6 రకాల పూల, పండ్ల మొక్కలు, చెత్తబుట్టను పంపిణీ చేశారు. స్థానిక సర్పంచ్ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు మండల ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కరించుకొని గ్రామాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచారు.
గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు
ఎమ్మెల్యే చొరవతో అభివృద్ధి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక చొరవ, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిషి కృషి సహకారంతో గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటున్నాం. పల్లెప్రగతితో గ్రామంలో చాలా సమస్యలు పరిష్కరించుకున్నాం. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను గుర్తించి అన్ని పనులను చేపట్టాం. ఎమ్మెల్యే సకాలంలో గ్రామానికి కావలిసిన పనులకు వెంటనే మంజూరు చేస్తున్నారు.
– వనం సైదమ్మాదుర్గయ్య, సర్పంచ్
సీసీ రోడ్లతో ఇబ్బందులు దూరం
సమైక్య పాలనలో గ్రామం ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. గత పాలకులు ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. గతంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు లేక నీరంతా ఇండ్ల ముందుచేరి వీధులన్నీ బురదమయమై అడుగుపెట్టాంటే గ్రామస్తులు నానా అవస్థలు పడేవారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గ్రామంలో సీసీ రోడ్లు, మురుగుకాలువలు నిర్మించారు. ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులతో మరింతా అభివృద్ధ్ది చెందుతుండడంతో మా ఊరు ఇప్పుడు మంచిగయింది.
-నిమ్మనగోటి రమేశ్,గ్రామస్తుడు