‘బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రస్థానం ప్రారంభమైనది. ఐదేండ్లుగా అన్ని రంగాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. నేను గెలిచిన రెండేండ్లలోనే 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టాం. నిత్యం జనం మధ్య ఉండే నాయకుడిని నేను. స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేస్తున్నాం. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాం. 50 ఏండ్లపాటు గ్రామ పంచాయతీ హోదాకు నోచని నాగార్జునసాగర్ను మున్సిపాలిటీ చేశాం. రూ.684 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ నిర్మిస్తున్నాం. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాగర్లో బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశాం. వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్, ఆడిటోరియం, మినీ స్టేడియం వంటివి ఎన్నో తీసుకొచ్చాం. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ దాదాపు నెరవేర్చాం. అభివృద్ధి పనులే రెండోసారి నా విజయానికి పునాదిరాళ్లు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థ్థితిలో లేరు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 18 ఏండ్లు మంత్రిగా పని చేసిన జానారెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల అండతో మరోసారి విజయం సాధిస్తా’ అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోమారు అవకాశం వచ్చిన నేపథ్యంలో నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలు పంచుకున్నారు.
– హాలియా, ఆగస్టు 30
‘నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రెండేండ్లుగా నియోజకవర్గంలో గడపగడపకూ తిరిగాను. ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నా. ప్రభుత్వ అభివృద్ధ్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల దరికి చేర్చా. నా పనితీరు నచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. అందుకు వారికి ధన్యవాదాలు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరినీ కలుపుకొని మరోసారి నియోజకవర్గం గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. రెండేండ్లలో నియోజకవర్గానికి రూ.1500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు, నియోజకవర్గ అభివృద్ధికి నేను చేసిన కృషి రెండోసారి నా విజయానికి పునాదిరాళ్లు అవుతాయి. బీజేపీ, కాంగ్రెస్ను ప్రజలు నమ్మే స్థ్థితిలో లేరు. సాగర్ ప్రజలు రెండుసార్లు ఓడించిన జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకునట్టే. ఆయన కుమారులు నాగార్జునసాగర్కు వచ్చిపోయే పర్యాటకులు మాత్రమే. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయం నాదే’ అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ గెలుపొందిన తరువాత నియోజకవర్గ ప్రజలకు చేసిన మంచి పనులు ఏమున్నాయి?
ఎమ్మెల్యే : 2018లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచిన తరువాత ఇక్కడ అభివృద్ధి శకం ప్రారంభమైంది. కరోనా రావడం, దురదృష్టవశాత్తు మా నాన్న, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి కాస్త సన్నగిల్లింది. నేను ఎమ్మెల్యే అయిన రెండేండ్లలోనే సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి రూ.1500 కోట్లు తీసుకొచ్చా. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాం. 50 ఏండ్లుగా అటు గ్రామ పంచాయతీ, ఇటు పట్టణం కాకుండా ఉన్న నాగార్జున సాగర్ను మున్సిపాలిటీ చేశాం. 24,886 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.684 కోట్లతో నెల్లికల్లు లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం. డీ 8, 9 కెనాల్స్లోని కాల్వ చివరి భూములకు సాగునీరు అందించేందుకు లిప్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. హాలియాలోప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాగర్లో బీసీ రెసిడిన్షియల్ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశాం. హాలియా, నాగార్జున సాగర్లో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ యార్డు, డిజిటల్ లైబ్రరీ, ఆడిటోరియం, హాలియాలో మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాం.
ఎమ్మెల్యే : కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తలాపున కృష్ణమ్మ పరిగెడుతున్నా ఇక్కడి ప్రజలకు తాగునీరు లేదు. కాల్వ చివరి భూములకు సాగునీరు వచ్చేది కాదు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా సాగర్ ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్ కొనుక్కొని తాగాల్సిన దుస్థితి. ఎడమ కాల్వ మొదటి మేజర్ రాజవరం కాల్వ చివరి భూములకు సాగునీరు అందేది కాదు. వేసవి వస్తే గుక్కెడు మంచినీళ్ల కోసం గిరిజనులు కిలోమీటర్ల కొద్ది నడిచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
ఎమ్మెల్యే : నాకు రెండోసారి టికెట్ రావడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పేదలు సంతోషం వెలిబుచ్చారు. పార్టీ శ్రేణులు పల్లెపల్లెనా పటాకులు కాల్చి ర్యాలీలు నిర్వహించారు. భగతన్ననే గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని చర్చ చేస్తున్నారు.
ఎమ్మెల్యే : నేను రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో పాల్గొన్న. మా నాన్న దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య 35 ఏండ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎ కేసీఆర్ ఆశీస్సులతో 2021లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాను.
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదన్నరేండ్లలో జనరంజక పాలన అందించారు. రెండేండ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నేను చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మా ప్రధాన ప్రచార అస్ర్తాలు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతోపాటు నియోజకవర్గంలో 90వేల మంది రైతులకు రైతుబంధు కింద రూ.1200 కోట్లు అందజేశాం. మృతిచెందిన 1,225 మంది రైతు కుటుంబాలకు రూ.61.25కోట్ల బీమా అందించాం. ఇవన్నీ నా ప్రచార అస్ర్తాలే.
ఎమ్మెల్యే : ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు ఆనందంగా ఉన్నది. నియోజకవర్గ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ఇది నా పనితీరుకు నిదర్శనం.
ఎమ్మెల్యే : పేదలందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేయించడం. అర్హులందరికీ బీసీ బంధు, దళితబంధు అందించడం, ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలో నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ ద్వారా వందలాది కంపెనీలను తీసుకొచ్చి జాబ్మేళా నిర్వహించి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించడం.
ఎమ్మెల్యే : గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరు శాతం అమలు చేశాం. ఇంటింటికీ తాగునీరు, నెల్లికల్లు లిఫ్ట్, హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన తండాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం. అమలు చేశాం. మౌళిక సదుపాయాల కోసం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.30 లక్షల నుంచి 70 లక్షల వరకు కేటాయించాం. హాలియాకు 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేశాం.
ఎమ్మెల్యే : కొత్తగా ఏర్పాటైన తిరుమలగిరి సాగర్ మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడంతోపాటు మండల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉంది. గ్రామాల నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు సౌకర్యం, ఆసుపత్రుల ఆధునీకరణ, సాగర్ కమలానెహ్రూ దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం, అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ను మరింతగా అభివృద్ధి పర్చాల్సి ఉంది. నియోజకవర్గానికి ఆర్టీసీ బస్సు డిపో, హాలియాలో 50 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేసి, ఇక్కడే పోస్టుమార్టం సౌకర్యం కల్పించడం వంటివి చేయాల్సి ఉంది.
ఎమ్మెల్యే : 2018కి ముందు నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రమే. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 19 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి పట్టించుకోకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడిపోయింది.
ఎమ్మెల్యే : నియోజకవర్గం ఏర్పడి 60 ఏండ్లు అయ్యింది. ఇందులో నిమ్మల రాములు 3సార్లు, రామ్మూర్తి యాదవ్ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే.. జానారెడ్డి 7సార్లు గెలిచి ఏమీ చేయలేదు. జానారెడ్డి 35 ఏండ్లలో చేయలేని అభివృద్ధి పనులను నేను రెండేండ్లలోనే పూర్తి చేశాను. మరోసారి నన్ను గెలిపిస్తే పేదలకు అండగా ఉండి మరింత సేవ చేస్తా.