పెద్దఅడిశర్లపల్లి, నవంబర్ 25 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిపేట, బాలాజీనగర్లో ‘మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు’లో భాగంగా రూ.20లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ మారుమూల తండాలకు సైతం సురక్షిత మంచినీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
మండలంలోని గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై కరపత్రం విడుదల చేశామని, వీటిపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధమా అని సవాలు విసిరారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, ఎంపీటీసీలు కలమ్మాకర్ణయ్య, బన్సిలాల్, సర్పంచులు పార్వతి, శీలం శేఖర్రెడ్డి, కడారి శ్రీనివాస్, అంజిరెడ్డి, నాయకులు ఆర్వపల్లి నర్సింహ, తోటకూరి పరమేశ్, లచ్చిరెడ్డి, పాల్వాయి రంగారెడ్డి, బోయ సుధాకర్రెడ్డి, యర్ర యాదగిరి, అంతిరెడ్డి, తూటిపల్లి నగేశ్ మహేందర్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.
కోదండాపురం వేంకటేశ్వర ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో కోదండపురం ఆలయ కమిటీని ఎన్నుకున్నారు. చైర్మన్గా ముచ్చర్ల ఏడుకొండల్యాదవ్తో పాటు ఐదుగురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.