నేరేడుగొమ్ము(చందంపేట), నవంబర్ 30 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఆయన సమక్షంలో నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన 30మంది టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే గర్వకారణంగా నిలుస్తుందన్నారు. నియోజకవర్గంలో 1.60లక్షల ఎకరాలకు సాగు నీరందించడమే లక్ష్యమన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మాహన్మానాయక్, జడ్పీటీసీ కేతావత్ బాలు, వైస్ ఎంపీపీ ఆరెకంటి రాములు, ఎంపీటీసీ వాంకునావత్ బిక్కూనాయక్, సర్పంచ్ నాగూనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, నాయకులు వడ్త్య బాలు, పల్స వెంకటయ్య, కేతావత్ రవీందర్, బైరెడ్డి కొండల్రెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ, తరుణ్, ఎస్కే.బషీర్, దూడ బావోజీ, చెన్నానాయక్, రాజు, మకట్లాల్, సరియా, మోహన్ పాల్గొన్నారు.