హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అధ్యయనంలో భాగంగా ఒడిశా అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ సభ్యు లు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర శాసనమండలి, శాసనసభను సందర్శించింది.
స్టాండింగ్ కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథజోషి బృందానికి శాసనమండలి సమావేశమందిరంలో మండలి చైర్మ న్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ, ఒడిశా శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపై సమావేశంలో చర్చించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులను గుత్తా సుఖేందర్రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్ సన్మానించారు.