బొడ్రాయిబజార్, డిసెంబర్ 11 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో ప్రభుత్వ రంగం నాశనమవుతుందన్నారు.
ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించేలా వ్యవహరిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థని ఖునీ చేస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం లౌకిక, ప్రజాస్వామ్య, అభ్యుదయ, సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, జె.నర్సింహారావు, పులుసు సత్యం, వీరబోయిన రవి పాల్గొన్నారు.