యాదగిరిగుట్ట, ఏప్రిల్16: అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలంతా అండగా నిలువాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరిగుట్ట పట్టణంలో ఆత్మకూరు(ఎం) మండలం రాఘవపురం గ్రామానికి చెందిన బీజేపీ మండల యువమోర్చా మాజీ అధ్యక్షుడు యర్కాల యతీశ్వర్గౌడ్, బీజేపీ గ్రామశాఖ కార్యదర్శి గుండు అరుణ్కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యెడ్ల బుచ్చిరెడ్డి, యర్కాల అంజయ్య, కాంగ్రెస్ యూత్ నాయకులు యర్కాల శ్రీకాంత్, ఎండీ రహీం, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సునీత ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గొంగిడి మహేందర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న సమయంలో ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రతి గడపకూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. పుట్టిన పాప నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. గడిచిన 9 ఏండ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు. 60 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోఎన్నో పథకాలు అమలవుతున్నాయని, వాటిని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వాస్తవాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, బీఆర్ఎస్ ఆత్మకూరు(ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యాస ఇంద్రారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు బాషబోయిన ఉప్పలయ్య, రైతుబంధు జిల్లా సభ్యులు కోరె భిక్షపతి, బీఆర్ఎస్ మండల సెక్రటరీ జనరల్ వెంకటేశ్గౌడ్, జిల్లా నాయకుడు రమేశ్గౌడ్, మండల యువజన విభాగం అధ్యక్షుడు శాంతన్రాజు, మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ, రాఘవపురం గ్రామశాఖ అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్కల స్వామిగౌడ్, యాదమ్మ, వెంకటేశ్, మల్లమ్మ, వెంకట్రెడ్డి, జాఫర్, ఆనంద్గౌడ్ పాల్గొన్నారు.
తుర్కపల్లి : యాదగిరిగుట్ట పట్టణంలో గొంగిడి మహేందర్రెడ్డి నివాసంలో తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తవిరెడ్డి భూపాల్రెడ్డి నాయకత్వంలో పాల సంఘం మాజీ చైర్మన్ ధర్మారెడ్డి, సుమంత్, యుగేంధర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, మోగిరెడ్డి నరసింహారెడ్డితోపాటు 50 మంది కాంగ్రెస్కు రాజీనామా చేసి మహేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ సెక్రటరీ జనరల్ శ్రీకాంత్రెడ్డి, యాదగిరిగుట్ట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటయ్య, తుర్కపల్లి బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్, బీరయ్య పాల్గొన్నారు.