నల్లగొండ, మార్చి 19 : వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్నారు. ఇందుకుగాను అవసరమైతే మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని నల్లగొండ క్లబ్లో మంగళవారం సొప్పేకాం, మకాం మరియు గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో ‘వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో మహిళా రైతులపై వ్యవస్థీకృత హింస’ అంశంపై మహిళా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్, మారెటింగ్ సౌకర్యం ఉన్న వరి, పత్తి, వేరుశనగ వంటి పంటలను వేసుకుంటే మహిళా రైతులకు మేలు జరుగుతుందన్నారు. నీటి వసతిని బట్టి ఏ పంట వేయాలనేది ముందుగానే నిర్ణయించుకొని దానిపై తగిన అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కొత్త పంటలు వేసేటప్పుడు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలన్నారు. మారెటింగ్ సౌకర్యం ఉన్న పంటలను మాత్రమే వేసుకోవాలని, లేకపోతే ఇబ్బందులు ఎదురోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. సొంతంగా మారెటింగ్ చేసుకునే అవకాశం ఉంటేనే చిరు ధాన్యాలు సాగు సాగు చేయాలని సూచించారు. మహిళా రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని, ఒక సీజన్లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ మరో సీజన్ ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. సమావేశంలో పలువురు మహిళా రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా.. వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిషారానికి కృషి చేస్తానని డీఏఓ తెలిపారు. గ్రామ్య రిసోర్స్ సెంటర్ నిర్వాహకురాలు రుక్మిణీరావు మాట్లాడుతూ జిల్లాలో మహిళా రైతుల పరిస్థితిపై సమగ్రంగా అధ్యయనం చేశామని, మహిళా రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నామని అన్నా రు. వాటితోపాటు ఇక్కడ వ్యక్తమైన అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తామని చెప్పారు. మహి ళా రైతుల జీవితాలను బాగు చేయడానికి త మ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, సభ్యుడు కిరణ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి, ఎంజీ యూనివర్సిటీ అధ్యాపకుడు మధు పాల్గొన్నారు.