దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు
అసమానతలను రూపుమాపనున్న బృహత్తర పథకం
మహనీయుల కలలు సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్
తెలంగాణపై విషం గక్కుతున్న బీజేపీ
విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నకిరేకల్ నియోజకవర్గంలో దళిత బంధు యూనిట్ల పంపిణీ
‘దళిత బంధుతో రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ పథకం ఆర్థిక అసమానతలను, అంతరాలను రూపుమాపి దేశంలో సామాజిక విప్లవానికి నాంది పలుకనున్నది. జాతిపిత మహాత్మాగాంధీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు కన్న కలలు దళిత బంధుతో సాకారమవుతాయి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నకిరేకల్ మండలంలోని నడిగూడెం, వల్లభాపురం, నార్కట్పల్లి మండలం బాజకుంటకు చెందిన 44 మందికి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి సోమవారం దళిత బంధు యూనిట్లను అందజేశారు. బాజకుంటలో లబ్ధిదారులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బహిరంగ సభల్లో మంత్రి జగదీశ్రెడ్డి ప్రసంగించారు.
దళితుల అభ్యున్నతిపై ఉద్యమ కాలం నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్తర ప్రణాళికతో ఉన్నారని, నేడు అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. సర్కారు సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కొత్త రాష్ట్రమైన తెలంగాణపై, ముఖ్యమంత్రి కేసీఆర్పై విషం కక్కుతున్నదని మండిపడ్డారు. మత విద్వేషాలు సృష్టించి ఇక్కడి ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
నకిరేకల్/నార్కట్పల్లి, జూలై 4: దళితబంధు పథకం సామాజిక విప్లవానికి నాంది పలుకుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న దళిత బంధు అసమానతలను రూపుమాపనున్న బృహత్తర పథకమని పేర్కొన్నారు. సోమవారం నకిరేకల్ మండలంలోని నడిగూడెం, వల్లభాపురం, నార్కట్పల్లి మండలంలోని బాజకుంట గ్రామాల్లో దళితబంధుకు ఎంపికైన 44మంది లబ్ధిదారులకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి దళితబంధు యూనిట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ ప్రభుత్వం విషం గక్కుతోందని, కేసీఆర్ ఒక్కడిని ఎదుర్కోలేక ప్రధానమంత్రి మోదీ, 18 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతోపాటు మొత్తం 365 మంది పెద్దమనుషులు వచ్చి హైదరాబాద్లో బహిరంగ సభ పెట్టారని ఎద్దేవా చేశారు. మత విద్వేషాలు సృష్టించి రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందాలు చేసుకుని తెలంగాణను పడగొట్టాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఎన్ని శక్తులు వచ్చినా తెలంగాణను, కేసీఆర్ను చేయలేరని పేర్కొన్నారు. ఇటీవల నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారని, వారి పేర్లు ఏమిటని ప్రజలు నాయకులు, కార్యకర్తలను అడిగారని అన్నారు. బూత్ లెవల్ అధికారులకు బూతులు తప్ప మరేమీ రావన్నారు. గల్లీ నాయకులు రాసిచ్చిందే కేంద్ర మంత్రులు చదువుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారం ఉన్న రాష్ర్టాల్లో కరెంటు కోసం ధర్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి నిత్యం ప్రజల కోసం పాటుపడుతుంటాడని, ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అభివద్ధికి నిధులు ఇవ్వమని కొట్లాడుతుంటాడని తెలిపారు.
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన..
నార్కట్పల్లి : మండలంలోని బాజకుంట గ్రామంలో దళితబంధు యూనిట్లను ఎమ్మెలే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ రాహుల్శర్మలతో కలిసి మంత్రి జగదీశ్రెడ్డి పంపిణీ చేశారు. రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. బాజకుంట గ్రామంలో రోడ్డు, గ్రామం చివర బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమలో ఆర్డీఓ జగదీశ్రెడ్డి, డీఆర్డీఏ పీడీ కాళిందిని, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, సర్పంచ్ ఈదులూరు సరిత, ఎంపీటీసీ చిర్రబోయిన సావిత్రీకుమారస్వామి, పార్టీ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగ : ఎంపీ బడుగుల
గతంలో కరెంటు పోయినా, వచ్చినా వార్త అయ్యేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంటు కోతలే లేకుండా రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు కట్టించిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
దళిత బంధు దేశానికే దిక్సూచి : ఎమ్మెల్యే చిరుమర్తి
దళితబంధు పథకం దేశానికే దిక్సూచి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేసీఆర్కు దళితులపై ఉన్న అమితమైన ప్రేమకు ఈ పథకం నిదర్శనమని పేర్కొన్నారు. దళితులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, నడిగూడెం, వల్లభాపురం ్ర గామాల సర్పంచులు మాద నాగరాజు, జయమ్మ, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.