నల్లగొండ, జూలై 28: నల్లగొండ, యాదాద్రి భువనగిరి అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయగా ఆమె స్థానంలో కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ను నల్లగొండ అదనపు కలెక్టర్గా నియమించింది.
ఇక యాదాద్రి భువనగిరి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న దీపక్ తివారీని కుమ్రం అసిఫాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా నియమించారు. ఆయన స్థానంలో పనిచేస్తున్న వీరారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.