కొండమల్లేపల్లి, ఆగస్టు 23 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓపీఎస్ విధానాన్ని అమలు పరచాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TPUS) నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ నిరసన కార్యక్రమంలో భాగంగా శనివారం భోజన విరామ సమయంలో కొండమల్లేపల్లి తాసీల్దార్ నరేందర్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 1 సెప్టెంబర్, 2004 తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేజీబీవీ, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ కొండమల్లేపల్లి మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు కొమిరే సైదులు, బద్దెల అంజయ్య, బొమ్ము రవి, మందడి శ్రీకాంత్ రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.