చిలుకూరు, జనవరి 17 : దేశంలోని రాజకీయ పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం చిలుకూరులో మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యులను ఇబ్బంది గురి చేస్తున్నదన్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సాయుధ పోరాట యోధుడిగా చేసిన సేవలను కొనియాడారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్, జిల్లా నాయకుడు బెజవాడ వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మండవ వేంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.