నల్లగొండ : ఓఆర్ఆర్ పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నార్కట్ పల్లి మాజీ ఎంపీపీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డి భౌతిక దేహానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. మల్లికార్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి, గుత్తా అమిత్ కుమార్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ యామ దయాకర్, తదితరులు ఉన్నారు.