BRS Party | గుర్రంపోడు, మార్చి 22: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ గుర్రంపోడు మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.
నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండున్నర సంవత్సరాల కాలంలో మూడు లక్షల కోట్ల పైచిలుకు ప్రజాధనాన్ని ప్రజా ప్రతినిధులు ఏ పథకాలకు ఎంత ఖర్చు చేశారో తెలియజేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో ప్రతీ పథకంలోని ప్రతీ పైసా నేరుగా లబ్ధిదారుకు చేరిందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి అభినయ యాదవ్ ,సర్పంచులు సింగం బాలకృష్ణ, చెవ్వు రమేష్, నాగులవంచ నాగేశ్వర్ రావు, కంచాని చంటి,మేకల వెంకట్ రెడ్డి, బచ్చనబోయిన శ్రీనివాస్, దోటి గణేష్,షేక్ సిరాజ్, పామనగుండ్ల వెంకన్న, కొండ్రపల్లి గిరి,ఆవుల కృష్ణ, షేక్ ఖాసీం,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!