Dhurandhar 2 | రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కొల్లగొడుతున్నప్పటికీ, సాంకేతిక లోపాల విషయంలో మాత్రం నెటిజన్ల విమర్శలకు గురవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశంలో చిత్ర యూనిట్ చేసిన అతిపెద్ద తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రణవీర్ సింగ్ శత్రువులతో పోరాడుతున్న ఒక ఫ్రేమ్ మూలలో కెమెరామెన్ స్పష్టంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిని గమనించిన ప్రేక్షకులు ఆ క్లిప్ను రికార్డ్ చేసి నెట్టింట షేర్ చేయడంతో, అది కాస్తా మీమ్స్కు దారితీసింది. “దర్శకుడు ఆదిత్య ధర్ చెప్పిన పీక్ డిటైలింగ్ అంటే ఇదేనా?” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇంత భారీ బడ్జెట్ సినిమాను ఎడిటింగ్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ దశలో సరిగ్గా పర్యవేక్షించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఆ కెమెరామెన్ కూడా సినిమాలో ఏదైనా సీక్రెట్ రోల్ చేస్తున్నాడా?” అని కొందరు ఎద్దేవా చేస్తుంటే, మరికొందరు మాత్రం దర్శకుడు అతివిశ్వాసంతో క్వాలిటీని గాలికొదిలేశారని మండిపడుతున్నారు.
A Cameraman showing in this scene.
Peak Detailing by Aditya Dhar
Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026