Virosh Wedding | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న (Virosh) వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా వేడుక చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం హైదరాబాద్లోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ గ్రోవర్ వీరిని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. పెళ్లి తర్వాత థాయిలాండ్లో హనీమూన్ ముగించుకుని వచ్చిన ఈ కొత్త జంటను కలిసి, సునీల్ గ్రోవర్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు అందించినట్లు తెలుస్తుంది. వీరు ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి విరామం తర్వాత విజయ్ మరియు రష్మిక త్వరలోనే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ‘రణబాలి’ చిత్రంతో మళ్లీ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.