హ్యాండ్లూమ్ పార్కును పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును బీఆర్ఎస్ ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. ప్రధాని మోదీ ప్రభుత్వ
ఆస్తులను అమ్ముతుంటే.. దివాలా తీసిన సంస్థలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారు. రూ.12.50 కోట్లకు కొని హ్యాండ్లూమ్ పార్కును కొన్నాం. దీన్ని బ్రహ్మాండంగా రూపుదిద్దుతాం. అవసరమైతే మరో రూ.15కోట్లు ఖర్చు చేస్తాం. అందులో నుంచి వచ్చే లాభాలను పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికి అందజేస్తాం. పార్కుపై ఓనర్షిప్ నేతన్నలకే ఒప్పజెప్పుతాం’
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)/భూదాన్ పోచంపల్లి : చేనేత కార్మికులకు ఎంతగానో మేలు చేసే భూదాన్పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ప్రారంభానికి అడుగులు ముందుకు పడడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కనీసం చర్యలు కూడా తీసుకోపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. హ్యాండ్లూమ్ పార్కును కేంద్ర ప్రభుత్వం దివాలా తీయిస్తే.. నేత కార్మికుల కోసం నాటి బీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేసి పునరుద్ధరించాలని సంకల్పించిన లక్ష్యం నెరవేరడం లేదు. కంప చెట్లతో నిండిపోయిన పార్కు నిరుపయోగంగా దర్శనమిస్తున్నది. పార్కుకు పునర్వైభవం తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొస్తే వేలాది మంది నేతన్నలకు ఉపాధి లభిస్తుంది.
నాడు అప్పుల భారంతో దివాలా..
2008లో కేంద్ర ప్రభుత్వం సీమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పారుల పథకం కింద దేశవ్యాప్తంగా 26 పారులను నెలకొల్పింది. ఇందులో భాగంగా చేనేతకు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భూదాన్పోచంపల్లి మండలంలోని కనుముకల గ్రామంలోని 22 ఎకరాల విస్తీర్ణంలో చేనేత పారును ఏర్పాటు చేసింది. రూ.45 కోట్ల వ్యయంతో 15 మంది ప్రమోటర్లు కలిసి పారును నిర్మించారు. ప్రాజెక్టులో ప్రమోటర్ల వాటాతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వరింగ్ క్యాపిటల్ కాకుండా ఎన్హెచ్డీసీకి కేంద్రం చెల్లించింది. దాంతో పార్కు నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. రుణ గ్రహీతలు బ్యాంకులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో గతేడాది పార్కు ఆస్తులను సీజ్ చేశారు. ఇలా అప్పుల భారంతో పార్కు మూతబడింది.
కేటీఆర్ ప్రత్యేక చొరవ..
చేనేత పార్కును అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారు. బ్యాంకులు వేలం వేస్తున్న పార్కును ప్రభుత్వం వేలం పాటలో పాల్గొని దక్కించుకునేలా చొరవ తీసుకున్నారు. గతేడాది ఆగస్టు 12న భూదాన్పోచంపల్లి పర్యటన సందర్శంగా పార్కును సందర్శించారు. పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో వచ్చే లాభం నేతన్నలకే దక్కుతుందని కూడా స్పష్టం చేశారు.
వస్ర్తాల నిల్వ కోసమేనా కొన్నది..?
హ్యాండ్లూమ్ పార్కు 22 ఎకరాల విస్తీర్ణంలో ఎంతో విశాలంగా ఉంటుంది. స్థలంతోపాటు గదులతో మంచి వసతులు ఉన్నాయి. అలాంటిది పారు కంప చెట్లతో నిండిపోయింది. పట్టింపు, పర్యవేక్షణ లేకపోవడం నిరుపయోగంగా మారింది. సిరిసిల్లలో తయారైన వస్త్రాలను ఈ పారులో గోడౌన్గా వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో లారీల్లో వస్త్రాలను తీసుకొచ్చి గోడౌన్లో భద్రపరిచారు.
పునరుద్ధరిస్తే వేల మందికి ఉపాధి
పదిహేనేండ్ల క్రితం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి చేనేత పారును ప్రారంభించారు. 5,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గతంలో పారులో 1,200 మంది చేనేత కార్మికులకు ఉపాధి లభించేది. క్రమంగా ఆ సంఖ్య 200కి తగ్గింది. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో కార్మికులు వీధిన పడ్డారు. మూతపడిన చేనేత పారును పునరుద్ధరిస్తే పూర్వ వైభవం వస్తుందని చేనేత కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది చేనేత కార్మికులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడనున్నది. వస్త్రాల తయారీలో కొత్తదనం, డిజైన్ల రూపకల్పనతోపాటు నాణ్యత పెరుగుతుంది.
12.50 కోట్లు వెచ్చించి..
అప్పుల భారంతో మూతపడడంతో బ్యాంకులు హ్యాండ్లూమ్ పారును వేలం వేశాయి. చేనేత కార్మికుల మేలు కోరి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొని రూ.12.50 కోట్లకు పారును దకించుకుంది. దాంతో హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు కోసం మార్గం సుగమమైంది. అంతేకాకుండా రాష్ట్ర పార్కుగా ఏర్పడి మళ్లీ తెరుచుకుంటుందని అంతా భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
పారును అందుబాటులోకి తేవాలి
హ్యాండ్లూమ్ పారును వినియోగంలోకి తీసుకొస్తే కార్మికులకు ఉపాధి కలుగుతుంది. కార్మికుల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సాంకేతికంగా వృత్తిపరమైన శిక్షణ ఇస్తే కొత్త డిజైన్లు రూపొందించడం ద్వారా వ్యాపారాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. చేనేత పారును పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన నిధులు కేటాయించాలి. నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు, కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. కార్మికులకు చేతినిండా పని కల్పించాలి.
– తడక రమేశ్, చేనేత నాయకుడు, భూదాన్పోచంపల్లి