నల్లగొండ, జనవరి 16 : డిండి ఎత్తిపోతల పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి రెవెన్యూ, భూ సేకరణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల కింద చేపట్టిన సింగరాజుపల్లి, చింతపల్లి, డిండి మెయిన్ కెనాల్, కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం, గొట్టిముకల రిజర్వాయర్ల భూ సేకరణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు పనుల ప్రగతిపై సమీక్షించారు.
ఏఎంఅర్పీలో భాగంగా చేపట్టిన పెండ్లిపాకల, ఉదయ సముద్రం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ భూ సేకరణ, పునరావాస పనులతోపాటు, అంబా భవాని, అయిటిపాముల, కాళేశ్వరం, పొగిళ్ల లిఫ్ట్ పనుల ప్రగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. డిండి ఎత్తిపోతలకు సంబంధించి నిర్వాసితుల పునరావాస కల్పనకు పీడీ నోటిఫికేషన్ జారీ చేయాలని దేవరకొండ ఆర్డీఓను ఆదేశించారు. ఉదయ సముద్రం కెనాల్పై మారింగ్ పనులు వేగవంతం చేయాలని సర్యే ల్యాండ్ రికార్డ్స్ ఏడీకి సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు రవి, దామోదర్ రావు, శ్రీరాములు, ఇరిగేషన్ ఈఈలు యాదన్ కుమార్, రాములు, యలమందయ్య, శ్రీధర్రావు, ఈఈ లు బుచ్చయ్య, లీల, సూపరింటెండెంట్లు హేమలత, రాజశేఖర్ పాల్గొన్నారు.