రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న భూదాన్పోచంపల్లికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత జౌళిశాఖ కమిషనర్ వర్షిణి, కలెక్టర్ హనుమంతు కే జెండగే చేనేత అధికారులతో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ ప్రదేశం, టూరిజం సెంటర్, చేనేత కార్మికుల సమావేశం ఏర్పాటు చేస్తున్న ఫంక్షన్హాల్కు చేరుకుని పలు సూచనలు ఇచ్చారు.
భూదాన్పోచంపల్లి, డిసెంబర్ 14 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనకు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ కమిషనర్ వర్షిణి, రాష్ట్ర వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్కుమార్, రాష్ట్ర హ్యాండ్లూమ్ అడిషనల్ డైరెక్టర్ పి.వెంకటేశం, డిప్యూటీ డైరెక్టర్ ఎం.వెంకటేశంతో కలిసి గురువారం భూదాన్పోచంపల్లిన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హెలిప్యాడ్ ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, ఎక్కడైనా కరెంటు తీగలు ఉంటే వాటిని తొలగించాలని అధికారులకు సూచించారు.
బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాట్లను, పోలీస్ స్టేషన్ పకన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. శ్రీ రంజన్ సిల్ యూనిట్ను, టూరిజం సెంటర్ను సందర్శించారు. చేనేత మగ్గంపై తయారు చేస్తున్న వస్త్రాలు, చిటికీల తయారీ, రంగుల అద్దకం ప్రక్రియను తిలకించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ విద్యాసాగర్, చౌటుప్పల్ ఆర్డీఓ జగన్నాథరావు, తాసీల్దార్ వీరబాయి, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, ఎస్ఐ విక్రంరెడ్డి, ఎంఆర్ఐ వెంకట్రెడ్డి, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు తడక రమేశ్, నాయకుడు ఎన్నం శివకుమార్, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.