భువనగిరి కలెక్టరేట్, మార్చ్ 2 : రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు, బాధ్యతల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ విభాగాలకు నియమించిన నోడల్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భువనగిరి, ఆలేరు, ఇబ్రహీంపట్నం, జనగాం, తుంగతుర్తి, నకిరేకల్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు. వివిధ స్థాయిల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందిని నియమించి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, ఎన్నికల సిబ్బందిని తరలించే వాహనాలు సమకూర్చాలని సూచించారు.
ఎన్నికల కోడ్ పర్యవేక్షించే టీములు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘సి’ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వంద నిమిషాలలో పరిషరించేలా చర్యలు తీసుకోవాలని, యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ‘సువిధ’ యాప్ ద్వారా రాజకీయ సభలు, ర్యాలీలు, వివిధ శాఖలు ఇవ్వాల్సిన అనుమతులను నిబంధనల ప్రకారం సకాలంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం జప్తు చేసిన నగదు, వస్తువులను స్వాడ్ టీములు, పోలీస్ అధికారులు సమన్వయంతో సీజర్ యాప్లో నమోదు చేయాలన్నారు.
వేసవి నేపథ్యంలో చెక్ పోస్టులు, పాయింట్ల వద్ద స్వాడ్ టీములకు అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తి అయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎ.భాసర్రావు, అడిషనల్ డీసీపీ, లా అండ్ ఆర్డర్ నోడల్ అధికారి సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి, బ్యాలెట్ పోస్టల్ నోడల్ అధికారి వి.శేఖర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి కె.నారాయణరెడ్డి, అడిషనల్ డీఆర్డీఓ, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జి.సురేశ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ నోడల్ అధికారి జి. వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నోడల్ అధికారి డి.విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి,
మీడియా నోడల్ అధికారి పి.వెంకటేశ్వర్రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, కమ్యూనికేషన్ ప్లాన్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి జయపాల్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఓటర్ హెల్ప్ లైన్ నోడల్ అధికారి ఆర్. సునంద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి, పీడబ్ల్యూడీ ఓటర్ల నోడల్ అధికారి కె. కృష్ణవేణి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్, ఏఎంఎఫ్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్స్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఫైర్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ నోడల్ అధికారి అశోక్, జిల్లా రవాణా అధికారి శ్యాంప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి, సూపరింటెండెంట్లు రామారావు, రామ్మూర్తి, పాల్గొన్నారు.