నల్లగొండ, మే 4 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన హోం ఓటింగ్ సౌకర్యంలో భాగంగా శనివారం వరకు నల్లగొండ జిల్లాలో 1300 మంది హోం ఓటింగ్ ను వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఇందులో 508 మంది సీనియర్ సిటిజన్లు,792 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నట్లు ఆమె వివరించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో శనివారం వరకు నల్లగొండ పార్లమెంట్ పరిధిలో 959 మంది ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఇతర పార్లమెంట్ నియోజకవర్గంలో కలుపుకొని 1,108 మంది ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందని, పోస్టల్ బ్యాలెట్ స్వీకరించిన ప్రతి ఉద్యోగి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారికి కేటాయించిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.