మిర్యాలగూడ, ఏప్రిల్ 10: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని, రిసెప్షన్ను, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్రూమ్లను, ఈవీఎంల కమీషనింగ్ రూమ్లను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు.
ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక్కడే డీఆర్సీ కేంద్రాలను,స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకోని గతంలోని అనుభవాలను దృష్టిలో ఉం చుకోని ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఆమె వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్రావు, డీఎస్పీ రాజశేఖర్రాజు, తాసీల్దార్ హరిబాబు ఉన్నారు.