– ప్రభుత్వ విప్ వేముల వీరేశం
కట్టంగూర్, ఏప్రిల్ 06 : డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్ర ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వారి ప్రక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా బలంగా మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగానే బీజేపీ నాయకుల్లో గుండెల్లో బయం మొదలైందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, సత్యదూరంగా ఉన్నాయన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలను బండి సంజయ్ తప్పుగా అర్ధం చేసుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకుని, బాధ్యతాతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి., కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది సుక్కయ్య పాల్గొన్నారు.