అంధత్వాన్ని నివారించి చీకటి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని సొంతూరైన నాగారంలో మంత్రి మంగళవారం కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. పరీక్షల తీరుతెన్నులు తెలుసుకున్నారు. అనంతరం పలువురికి కళ్లద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చేపడుతున్న కంటి వెలుగుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. తెలంగాణలో అంధత్వ నిర్మూలన జరుగాలనే సంకల్పంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి అద్దాలు అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు, వృద్ధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు అయ్యారని కొనియాడారు. అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
నాగారం జనవరి 24 : ప్రజారోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగానే రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం తన సొంత గ్రామం నాగారంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించి గ్రామాస్తుల్లో ఉత్సాహం నింపారు. గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం తీరును పరిశీలించారు. గ్రామస్తులు, వృద్ధులతో మాట్లాడారు. మంత్రి పలుకరింపుతో వృద్ధులు సంబురపడ్డారు. ఆయన స్వయంగా లబ్ధిదారులకు కంటి అద్దాలు అందించారు. ప్రతి ఒక్కరినీ పలకరించుకుంటూ క్యాంపులో సందడి చేశారు. ప్రజలంతా కంటి వెలుగు ద్వారా కంటి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
స్వగ్రామంలో మంత్రి కంటి వెలుగు క్యాంపునకు రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంధత్వ నివారణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు అందించి అవసరం ఉన్న వారికి శస్త్ర చికిత్సలు కూడా ప్రభుత్వమే నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు. ఏడు రోజుల నుంచి కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు సమన్వయంతో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్, ఆప్తమాలజిస్ట్ ఉమా, ఎంపీపీ కూరం మణీవెంకన్న, తాసీల్దార్ హరిచంద్రప్రసాద్, మండల వైద్యాధికారి హర్షవర్ధన్గౌడ్, ఎంపీడీఓ శోభారాణి, సూపర్వైజర్ వినోద, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అంబయ్య, ఉప సర్పంచ్ కన్నెబోయిన భద్రయ్య, నాయకులు సోమయ్య, అరు ణ్, ఉపేందర్, లింగమల్లు, సైదులు, మురళి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు.